Fire Accident: ప్రజాభవన్‌కు సమీపంలోని పెట్రోల్ బంకులో మంటలు

Fire break out near Praja Bhavan petrol bunk

  • భూగర్భ ట్యాంక్ మూత తీస్తుండగా చెలరేగిన మంటలు
  • పరుగులు పెట్టిన ప్రజలు
  • మంటలను ఆర్పిన సిబ్బంది

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు సమీపంలోని పెట్రోల్ బంకులో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. భూగర్భ ట్యాంక్ మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకుని, పైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.

  • Loading...

More Telugu News