Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Telangana High Court Reliefs TDP MLA Raghurama Krishna Raju

  • ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియ కేసు
  • రఘురామకృష్ణరాజు ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ ప్రొసీడింగ్స్
  • వాటిని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఎస్‌బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

ఈ కేసులో ప్రతివాదులైన రిజర్వు బ్యాంక్, ఎస్‌బీఐలకు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే, ఇంద్-భారత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ డైరెక్టర్ కె.సీతారామం ఖాతాను కూడా మే 28న ఇలాగే మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ ప్రొసీడింగ్స్ జారీచేసింది. తాజాగా, ఆయనకు కూడా ఊరట కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

  • Loading...

More Telugu News