Ashwin Babu: థియేటర్లలో ఈ వారం సందడి చేసే సినిమాలివే!

New Movies Update

  • ఆగస్టు 1న విడుదలవుతున్న 'శివం భజే'
  • 2వ తేదీన బరిలోకి దిగుతున్న 'బడ్డీ'
  • విజయ్ భాస్కర్ నుంచి వస్తున్న 'ఉషా పరిణయం'
  • లైన్లో మరో రెండు సినిమాలు 


ఈ వేసవిలో .. ఆ తరువాత కూడా థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. చాలామంది హీరోల సినిమాలు నిర్మాణ దశలో ఉండటమే అందుకు కారణం. ఈ వారం మాత్రం చిన్న సినిమాల జోరు కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఉత్సాహంతో వరుసగా ఈ సినిమాలు రంగంలోకి దిగిపోతున్నాయి. ఆ జాబితాలో ముందుగా 'శివం భజే' కనిపిస్తోంది. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, అప్సర్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమా, ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు రానుంది. ఇక ఆగస్టు 2వ తేదీన అల్లు శిరీశ్ - గాయత్రి భరద్వాజ్ జంటగా రూపొందిన 'బడ్డీ' విడుదలవుతోంది. స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శ్యామ్ ఆంటోని దర్శకత్వం వహించాడు. ఇక అదే రోజున 'ఉషా పరిణయం' ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు కె. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీకమల్ ను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా ఇది. ఈ శుక్రవారమే ప్రేక్షకులను పలకరించనున్న మరో సినిమా, 'తిరగబడరసామీ'. రాజ్ తరుణ్ - మాల్వి మల్హోత్రా జంటగా రూపొందిన ఈ సినిమాకి, రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఇక అదే రోజున విజయ్ ఆంటోని 'తుఫాన్' .. నటుడు కృష్ణవంశీ - మోక్ష జంటగా నటించిన అలనాటి రామచంద్రుడు విడుదల కానున్నాయి. ఈ సినిమాలలో ఏది ఎక్కువ వసూళ్లు రాబడుతుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News