Team India: శ్రీలంకను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

Team India bowlers restricts Sri Lanka for 161 runs

  • పల్లెకెలెలో టీమిండియా, శ్రీలంక రెండో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసిన శ్రీలంక 

శ్రీలంకతో టీ20 సిరీస్ లో టీమిండియా బౌలర్లు మరోసారి స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబరిచారు. నేడు పల్లెకెలెలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరీరా 53, పత్తుమ్ నిస్సాంక 32, కమిందు మెండిస్ 26 పరుగులు చేశారు. కెప్టెన్ చరిత్ అసలంక 14 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News