Anagani Satya Prasad: జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరు: మంత్రి అనగాని సత్యప్రసాద్

AP Minister Anagani Satya Prasad slams Jagan comments

  • ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్న వైసీపీ
  • ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని జాతీయస్థాయిలో తెలియజేస్తామన్న జగన్
  • ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళతారంటూ నిలదీసిన మంత్రి అనగాని

ఏపీలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తామని, అందుకే ఢిల్లీలో 'సింబాలిక్ ప్రొటెస్ట్' నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు. 

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను హత్య చేశారని, జగన్ పాలనలో ఎన్నో హత్యలు జరిగాయని ఆరోపించారు. జగన్ సవ్యంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. జగన్ తప్పుడు మాటలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణచివేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News