Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించండి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy review on Palamuru projects

  • కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సమీక్ష
  • కొడంగల్‌లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన
  • మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై గురువారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అలాగే కొడంగల్‌లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

  • Loading...

More Telugu News