Suryapet District: క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి

Three dead people dead in Surypaet district

  • సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారంలో విషాదం
  • ఉదయం క్వారీని చూసేందుకు వెళ్లిన శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు
  • క్వారీలో పడిపోయిన కూతురు
  • ఆమెను కాపాడే క్రమంలో అందరూ మృతి

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో చోటు చేసుకుంది. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్ కాగా, రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మంగళవారం వీరు ఓ విందులో పాల్గొన్నారు.

బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు క్వారీని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజు కూతురు క్వారీలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్ రెడ్డి, రాజు అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News