Congress: నేటి మధ్యాహ్నం ప్రజాభవన్‌లో టీపీసీసీ సమావేశం

TPCC meeting in Praja Bhavan

  • మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ భేటీ
  • పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, తదితరులు
  • ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై చర్చ

నేడు ప్రజాభవన్‌లో టీపీసీసీ నేతలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు సమావేశానికి హాజరవుతున్నారు.

పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశనం చేయనున్నారు.

  • Loading...

More Telugu News