Chandrababu: ఉచిత ఇసుక పాలసీలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు: సీఎం చంద్రబాబు

Chandrababu said Ministers and MLAs should not involve into free sand policy

  • ముగిసిన క్యాబినెట్ భేటీ
  • మంత్రులతో రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చ
  • ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నామని చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని అన్నారు. 

అక్టోబరు తర్వాత ఇసుక్ రీచ్ లన్నీ అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News