BJP: బీజేపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసినవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

Union Minister warns YSRCP leaders

  • వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో తలదూర్చారన్న శ్రీనివాసవర్మ 
  • వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వంచించారని పురంధేశ్వరి మండిపాటు
  • వైసీపీ నాయకుడిని విమర్శించినా తనపై కేసు పెట్టారన్న విష్ణుకుమార్ రాజు

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆ పార్టీ నాయకులు అనేక విషయాల్లో తలదూర్చారని... బీజేపీ కార్యకర్తలను కూడా టార్గెట్ చేశారని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. తమ కార్యకర్తల్ని టార్గెట్ చేసిన వారికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. సోమవారం విశాఖలోని సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వంచించి, రైతాంగాన్ని మోసం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. అంతర్వేది రథం, రామతీర్థం విగ్రహాలు నాశనం చేయడం వంటి దుర్మార్గపు పాలన సాగించారని మండిపడ్డారు.

ఎన్నికల ర్యాలీలో వైసీపీ నాయకుడిని తాను విమర్శిస్తే తనపై కేసు పెట్టారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. తాను బెయిల్ తెచ్చుకొని ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. విమానాశ్రయంలో చంద్రబాబును ఘోరంగా అవమానించారని... పవన్ కల్యాణ్‌ను, కార్యకర్తలను రౌడీమూకలు అడ్డుకున్నాయన్నారు. రెడ్‌బుక్‌లో ఉన్న ఎవరినీ వదిలి పెట్టకూడదన్నారు.

  • Loading...

More Telugu News