Stock Market: వరుసగా రెండో సెషన్లో కూడా లాభపడ్డ మార్కెట్లు

Markets ends in profits

  • 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 84 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.55 శాతం పెరిగిన ఎస్బీఐ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో సెషన్లో లాభాలను ఆర్జించాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు, దిగ్గజ కంపెనీల షేర్ల కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో కదలాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,665కి చేరుకుంది. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,587 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.55%), ఎన్టీపీసీ (2.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.98%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.96%), ఐటీసీ (0.83%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్ (-1.44%), టాటా స్టీల్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.77%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.44%), టెక్ మహీంద్రా (-0.43%).

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News