Team India: జింబాబ్వేతో చివరి టీ20 మ్యాచ్... టాస్ ఓడిన టీమిండియా

Zimbabwe won the toss and put Team India batting first


ఇప్పటికే జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా... నేడు నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదిక. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 12, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14 పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ సికిందర్ రజా 1, రిచర్డ్ ఎంగరావా 1, బ్లెస్సింగ్ ముజరబాని 1 వికెట్ తీశారు.

మొదటి ఓవర్లో తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్ లు కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గిల్ కూడా అవుట్ కావడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సంజు శాంసన్, రియాన్ పరాగ్ క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News