Team India: జింబాబ్వేతో నాలుగో టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in 4th T20 against Zimbabwe

  • టీమిండియా, జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • 2-1తో ముందంజలో ఉన్న టీమిండియా
  • నేడు హరారేలో నాలుగో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ కైవసం

టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన భారత జట్టు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గి సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. అందుకే శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని యువ జట్టు గెలుపుపై కన్నేసింది. 

ఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్ పాండే అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు. అవేష్ ఖాన్ స్థానంలో తుషార్ దేశ్ పాండేకు తుది జట్టులో స్థానం కల్పించారు. మరోవైపు, ఆతిథ్య జింబాబ్వే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.

  • Loading...

More Telugu News