Perni Nani: "మంచి పనోడు" అంటూ మంత్రి నిమ్మల రామానాయుడుపై పేర్ని నాని సెటైర్లు

Perni Nani satires on minister Nimmala Ramanaidu

  • పేర్ని నాని ఆసక్తికర ప్రెస్ మీట్
  • తల్లికి వందనం పథకం నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడుపై వ్యాఖ్యలు
  • ఆయన తప్ప ప్రజలెవరూ హ్యాపీగా లేరన్న పేర్ని నాని

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీడీపీ కూటమి సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తల్లికి వందనం పథకంపై ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం పట్ల ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. 

తల్లికి వందనం పథకం గురించి మంచి పనోడు ఒకాయన ఏం చెబుతున్నారో వినండి అంటూ నిమ్మల రామానాయుడు వీడియోను పేర్ని నాని ప్లే చేశారు. 

"ప్రభుత్వ పథకాలపై పాంప్లెట్ చూశారా, అందరికీ వివరించారా... నీకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు వస్తాయి" అని ఓ యువతిని ఉద్దేశించి నిమ్మల రామానాయుడు పేర్కొనడం ఆ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు, అక్కడే ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ... "ఈ అబ్బాయికి రూ.15 వేలు, ఆ పాపకి రూ.15 వేలు, ఈ పాపకు రూ.15 వేలు, ఆ బాబుకు రూ.15 వేలు... అదిగో ఆ చిట్టి పిల్లకు కూడా రూ.15 వేలు వస్తాయి... అందరూ హ్యాపీయే కదా" అంటూ ఓ సైకిల్ మీదున్న రామానాయుడు స్థానికులకు వివరించడం ఆ వీడియోలో ఉంది. 

దీనిపై పేర్ని నాటి సెటైర్లు వేశారు. "పదిహేను వేలు, పదిహేను వేలు అంటూ హోల్ సేల్ మార్కెట్లో పిలుస్తుంటారు. పైగా, హ్యాపీయే కదా అంటున్నాడు. ఎవరు హ్యాపీ అంటే... ఆ మాట చెప్పినాయన హ్యాపీ.

ముందొక పైలెట్, వెనుకొక ఎస్కార్ట్... గన్ మన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటేరియట్ లో ఆఫీసు.... ఎవరు హ్యాపీ... ఆ సైకిల్ మీద కనిపించినాయన హ్యాపీ! ఇప్పుడాయన మళ్లీ సైకిల్ ఎక్కడంలేదు... అంతా కార్లోనే. ఇక మళ్లీ సైకిల్ అవసరంలేదు. ఆ తల్లులు హ్యాపీ కాదు, ఆ పిల్లలు హ్యాపీ కాదు... ఆయనొక్కడే హ్యాపీ" అంటూ పేర్ని నాని విమర్శించారు.

  • Loading...

More Telugu News