Raj Tarun: హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీపై కేసు నమోదు

Police case registered on Hero Raj Tarun

  • రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు
  • 2016లో తాను గర్భం దాల్చానన్న లావణ్య
  • రాజ్ తరుణ్, మాల్వీ తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆరోపణ 

హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 

ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆధారాలు చూపించాలని లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేశారు. 

ఈ సందర్భంగా మీడియాతో లావణ్య మాట్లాడుతూ... రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. 2014లో తాము పెళ్లి చేసుకున్నామని... ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం ఆదుకుందని... రూ. 70 లక్షల వరకు ఆయనకు ఇచ్చామని తెలిపారు. 2016లో తాను గర్భం దాల్చానని... రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పారు. 

తనను రాజ్ తరుణ్, మాల్వీ డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య తెలిపారు. జనవరిలో తాను యూఎస్ నుంచి తిరిగి వచ్చానని... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని... తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రశ్నిస్తే... చంపేస్తామని రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ బెదిరించారని వెల్లడించారు.

Raj Tarun
Malvi
Lavanya
Case
Tollywood
  • Loading...

More Telugu News