Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసి టీమిండియా జెర్సీని బహూకరించిన క్రికెటర్ సిరాజ్

Cricketer Siraj gifted Team India jersy to CM Revanth Reddy

  • టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్‌కు సీఎం అభినందన
  • శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చిన ముఖ్యమంత్రి
  • పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు గాను సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

పాలమూరులో ముఖ్యమంత్రి పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాలమూరులో పర్యటించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్‌ కలెక్టరేట్ ఆలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News