Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో జంట ఎన్‌కౌంటర్లు.. నలుగురు టెర్రరిస్టులు హతం

4 terrorists killed as twin encounters break out in Jammu and Kashmir

  • ఫ్రిస్కల్ చిన్నిగమ్, మోడెర్‌గామ్ గ్రామాల్లో పోలీసుల ఉగ్రవాద ఏరివేత చర్యలు
  • భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు, ప్రతిదాడికి దిగిన సైనికులు
  • మొత్తం నలుగురు టెర్రరిస్టులను మట్టుపెట్టిన భద్రతాదళాలు
  • అమరులైన ఇద్దరు సైనికులు, ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతాయన్న ఐజీ

జమ్మూకశ్మీర్‌లో జరిగిన జంట ఎన్‌కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఘటనల్లో భద్రతా దళాలకు చెందిన ఇద్దరు సిబ్బంది కన్నుమూశారు. టెర్రరిస్టులు దాగున్నారన్న సమాచారంతో మోడెర్‌గామ్ గ్రామంలోకి వెళ్లిన భద్రతాదళాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలో కనీసం ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ కాల్పుల్లో లాన్స్‌నాయక్ ప్రదీప్ నయన్ కూడా మరణించారని పేర్కొన్నారు.

లష్కర్ ఉగ్రవాదులు దాగున్నారన్న అనుమానంతో భద్రతా దళాలు ఫ్రిస్కల్ చిన్నిగమ్ గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమవగా 01 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవాల్దార్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను కశ్మీర్ ఐజీ వీకే బిర్ధీ సందర్శించారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News