Chandrababu: కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

Chandrababu review on Kuppam Development
  • సింపుల్ గవర్నమెంట్.... ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమన్న ముఖ్యమంత్రి
  • అధికారులు ఫిజికల్... వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని సూచన 
  • కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదని ఆదేశాలు
  • రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయాలని సూచన
  • రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుండే శ్రీకారం చుడదామని పిలుపు
  • రానున్న రోజుల్లో కుప్పంలో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులు సీఎం దిశానిర్దేశం

పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం...పేదరికం లేని మండలం... పేదరికం లేని నియోజకవర్గంగా మున్ముందు కుప్పాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక ప్రణాళికతో అధికారులు పని చేయాలని సూచించారు.

సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధామని అధికారులకు తెలిపారు. గత అడ్మినిస్ట్రేషన్‌కు... ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతోందన్నారు. అధికారులు ఫిజికల్... వర్చువల్ పని విధానాలకు సిద్దపడాలన్నారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్ద సమావేశాలు, భారీ కాన్వాయ్‌లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే సూచించినట్లు చెప్పారు. అధికారుల కూడా వేగంగా రియాక్ట్ కావాలని... ఎఫెక్టివ్‌గా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. 

కుప్పం అతిథి గృహంలో సమావేశం

కుప్పం అతిథి గృహంలో చిత్తూరు జిల్లా, నియోజకవర్గ అధికారులతో బుధవారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తి వేయాలన్నారు. రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

గత 5 ఏళ్లు అధికారులు మనసు చంపుకుని పని చేశారన్నారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికే తాను రాలేని... మాట్లాడలేని పరిస్థితులు కల్పించారన్నారు. 2019 వరకు ఒక్క కేసు లేని తనపై హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని... ఇది తనను బాధించిందన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని ఆకాంక్షించారు.

ప్రణాళికలు సిద్దం చేయండి... మార్పు కనిపించాలి

‘నియోజకవర్గంలో కొన్ని సమస్యలు సవాళ్లుగా మారాయన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరివ్వడంతో పాటు, హంద్రీనీవా కాల్వ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్నారు. డైరీ, మిల్క్, సిల్క్, హనీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కుప్పంకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా కుప్పంను ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తామన్నారు. యువతలో నైపుణ్యాన్ని లెక్కించేందుకు, అవకాశాలు కల్పించేందుకు, వారిలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని..... నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలన్నారు.

  • Loading...

More Telugu News