Uttar Pradesh: స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే బాలుడి మృతి!

up boy collopses and dies after coming out of swimming pool

  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
  • స్విమ్మింగ్ పూల్ బటయకొచ్చిన మరుక్షణమే కుప్పకూలిన 15 ఏళ్ల బాలుడు
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్విమ్మింగ్ పూల్‌లో అప్పటివరకూ ఈత కొట్టి బయటకొచ్చిన మరుక్షణమే టీనేజ్ బాలుడు కుప్పకూలి మరణించాడు. మీరట్‌లో వెలుగు చూసిన ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడిని శివాల్‌ఖాస్ వాస్తవ్యుడిగా గుర్తించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, స్విమ్మింగ్ పూల్ బయటకు రాగానే ఆ బాలుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడు పరారీలో ఉండగా ఘటన నేపథ్యంలో అధికారులు దాన్ని మూసేశారు. బాలుడి మృతికి కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News