Nara Bhuvaneswari: చంద్ర‌బాబు అసెంబ్లీలో అడుగు పెట్టిన వేళ భువ‌నేశ్వ‌రి ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

Nara Bhuvaneswari Interesting Tweet on CM Chandrababu Naidu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆయ‌న అర్ధాంగి భువ‌నేశ్వ‌రి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. "నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది….ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!" అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు శ‌ప‌థం చేసిన దృశ్యాలు, తాజాగా గౌర‌వంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేసిన‌ దృశ్యాల‌తో కూడిన వీడియోను జ‌త చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Nara Bhuvaneswari
CM Chandrababu Naidu
TDP
Andhra Pradesh
Twitter

More Telugu News