Team India: అమెరికాతో మ్యాచ్... టీమిండియా ముందు సింపుల్ టార్గెట్

Team India restricts USA 110 runs

  • టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా × యూఎస్ఏ
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు
  • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు నమోదు 

టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో టీమిండియా నేడు ఆతిథ్య అమెరికాతో తలపడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. 

స్టీవెన్ టేలర్ 24, నితీశ్ కుమార్ 27, కోరే ఆండర్సన్ 14, కెప్టెన్ ఆరోన్ జోన్స్ 11, వాన్ షాల్విక్ 11 (నాటౌట్), హర్మీత్ సింగ్ 10 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయడం విశేషం. హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News