Ramoji Rao: రామోజీరావు చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళి

Revanth Reddy went to Ramoji Film City

  • రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
  • రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి
  • వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News