Kinjarapu Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు కేటాయించిన శాఖలు ఇవే!

NDA allocates ministries to TDP and BJP MPs

  • కేంద్రంలో నిన్న కొలువుదీరిన ఎన్డీయే 3.0 సర్కారు
  • టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్ లో చోటు
  • రామ్మోహన్ కు కీలక శాఖ అప్పగించిన ప్రధాని మోదీ

ఎన్డీయే 3.0 మంత్రివర్గ సభ్యులకు నేడు శాఖలు కేటాయించారు. టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను అప్పగించారు. టీడీపీ తరఫున కేంద్రమంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కూడా కేంద్ర క్యాబినెట్ లో స్థానం లభించింది. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవి కేటాయించారు. శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి లభించింది.

  • Loading...

More Telugu News