Ramoji Rao: రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశాన్ని అందించిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman paid final respects to RamojiRao

  • కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపమని మోదీ తనను పంపించారన్న కేంద్రమంత్రి
  • రామోజీరావు మరణం తెలుగువారికి తీరనిలోటు అన్న నిర్మలా సీతారామన్
  • ఆరోగ్యం గురించి రెండ్రోజుల క్రితమే మోదీ ఆరా తీశారని వెల్లడి

రామోజీరావు కుటుంబ సభ్యులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్... ప్రధాని మోదీ సందేశాన్ని అందించారు. మరణవార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపమని ప్రధాని తనను పంపించారన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటు అన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రధాని రెండు రోజుల క్రితం ఆరా తీసినట్లు చెప్పారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రధానికి తెలుసునన్నారు. మనందరికీ ఇదొక పెద్ద విషాదవార్త అన్నారు.

Ramoji Rao
Nirmala Sitharaman
Narendra Modi
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News