Chandrababu: చంద్రబాబు విజయానికి గుర్తుగా ‘జయ జయోస్తు’ గ్రంథాలు

- గ్రంథాలను రూపొందిస్తున్న కిమ్స్ ఆసుపత్రుల చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య
- ఈ మహత్తర కార్యాన్ని పురాణపండకు అప్పగించిన వైనం
- రేపు మంగళగిరి చేరుకోనున్న గ్రంథాలు
- తొలుత మంగళగిరి నరసింహస్వామి, బెజవాడ దుర్గమ్మకు సమర్పణ
- ఆ తర్వాత టీడీపీ శ్రేణులకు పంపిణీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ఆయనకు జయం పలుకుతూ రెండు గ్రంథాలు సిద్ధమవుతున్నాయి. కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ఈ గ్రంథాలను రూపొందిస్తున్నారు. ఈ రెండు మంగళ గ్రంథాలలో ఒకదాని రచనను ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్కు అందించారు. గ్రంథంలో ఒకవైపు చంద్రబాబు దంపతుల ఫొటోలు ఉండాలని, మిగిలిన భాగాన్ని దైవత్వంతో నింపాలని కోరినట్టు కృష్ణయ్య తెలిపారు. ఈ గ్రంథానికి ‘నారసింహో.. ఉగ్రసింహో’గా నామకరణం చేశారు. నరసింహస్వామి కటాక్షం చంద్రబాబు దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ మహత్తర కార్యానికి శ్రీనివాస్ చేత శ్రీకారం చుట్టించినట్టు వివరించారు.
