Chegondi Harirama Jogaiah: కూట‌మి విజ‌యం.. ప‌వ‌న్‌కు హ‌రిరామ జోగ‌య్య లేఖ‌

Harirama Jogaiah letter to Janasena Party Chief Pawan Kalyan

  • పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ప‌వ‌న్‌కు కాపు నేత‌ శుభాకాంక్ష‌లు
  • ధ‌ర్మ, నీతివంత‌మైన పాల‌న‌తో ముందుండి న‌డిపించాల‌ని జ‌న‌సేనానికి సూచన‌
  • ప్ర‌ధానంగా జాతికి మంచి పేరు తీసుకొచ్చేలా పాల‌న కొన‌సాగించాల‌ని హిత‌వు

కాపు నేత హ‌రిరామ జోగ‌య్య ఏపీలో కూట‌మి విజ‌యంపై తాజాగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు లేఖ రాశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జ‌న‌సేనానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా రాజ్యాధికారంలో భాగ‌స్వామిగా ధ‌ర్మ పాల‌న‌, నీతివంత‌మైన పాల‌న‌తో ముందుండి న‌డిపించాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా జాతికి మంచి పేరు తీసుకొచ్చేలా పాల‌న కొన‌సాగించాల‌ని ఆకాంక్షించారు. 

ఇక మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఫ‌లితాల్లో జ‌న‌సేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌స‌భ స్థానాల్లోనూ విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురంలో స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత‌పై 70వేల‌కు పైగా మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించారు.

  • Loading...

More Telugu News