Chandrababu: కాబోయే సీఎం చంద్రబాబును కలిసిన ఏపీ సీఎస్, డీజీపీ

AP CS And DGP Harish Kumar meets Chandrababu
  • ఎన్నికల్లో కూటమి విజయం నేపథ్యంలో శుభాకాంక్షలు
  • చంద్రబాబు నివాసానికి అధికారుల క్యూ
  • ఢిల్లీకి బయలుదేరనున్న టీడీపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ చీఫ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసం సందడిగా మారింది. పార్టీ నేతలు, అనుచరులు, కార్యకర్తలతో పాటు అధికారులు ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ విజయం నేపథ్యంలో టీడీపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధించడంతో తదుపరి కార్యాచరణ కోసం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News