Kangana Ranaut: మండిలో కంగనా రనౌత్ విజ‌యం

Kangana Ranaut wins from Himachal Pradesh Mandi

  • కంగనా రనౌత్‌ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం
  • హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి గెలుపు
  • తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగురవేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగన తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా ఈ స్థానానికి జూన్‌ 1న పోలింగ్ జరిగింది. 

ఇక విలేకరుల సమావేశంలో రనౌత్ మాట్లాడుతూ.. "మేము ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పేరు మీద పోరాడాము. ఆయన విశ్వసనీయత, ఆయన హామీ, ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం ఫలితంగానే మేము మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం" అని అన్నారు. 

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ కూడా విజయం సాధించారు.

  • Loading...

More Telugu News