Komatireddy Venkat Reddy: ఇవాళ రాత్రికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి... 12 సీట్ల వరకు గెలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy says Conress will win 12 seats in telangana

  • కాంగ్రెస్ 9 నుంచి 12 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని జోస్యం
  • 4వ తేదీ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదని వ్యాఖ్య
  • సోనియాపై అనుచిత విమర్శలు చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్న మంత్రి

ఇవాళ రాత్రికి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయని... కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల 4వ తేదీన ఫలితాలు వచ్చాక బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై అనుచిత విమర్శలు చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

  • Loading...

More Telugu News