GDP: గత ఆర్ధిక సంవత్సరంలో అంచనాలను మించిన భారత జీడీపీ... 8.2 శాతంగా నమోదు

At 8 India FY24 growth beats D Street estimates

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరు కొనసాగుతుందంటున్న ఆర్థిక నిపుణులు
  • జనవరి-మార్చి త్రైమాసికానికి 7.8 శాతంగా నమోదైన జీడీపీ
  • 5.63 శాతంగా నమోదైన ద్రవ్యలోటు

2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి జీడీపీ 7.8 శాతం నమోదైంది. తయారీ రంగంలో బలమైన వృద్ధి కనిపించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (FY24) గానూ దలాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమిస్తూ, జీడీపీ 8.2 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

శుక్రవారం ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా ప్రకారం, రంగాల వారీగా విశ్లేషిస్తే రియల్ గ్రాస్ వ్యాల్యూ 2022-23 ఆర్థిక సంవత్సరంలోని 6.7 శాతంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతానికి పెరిగింది. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్ డాలర్ల వైపు నడిపించింది. రానున్న కొన్నేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.2 శాతంగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63 శాతంగా నమోదైంది. వాస్తవానికి బడ్జెట్‌లో 5.8 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేశారు. వాస్తవ రూపంలో చూసినప్పుడు ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ.16.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. స్థూలంగా పన్నుల రూపంలో రూ.23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా వ్యయం రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది.

  • Loading...

More Telugu News