NTR: ఎన్టీఆర్... తెలుగుజాతి చిహ్నం అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy tweet on NTR jayanthi

  • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురి నివాళి
  • పార్టీలకతీతంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల నివాళి
  • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల ట్వీట్

నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తదితర తెలంగాణ నేతలు కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

'ఎన్టీఆర్… తెలుగుజాతి చిహ్నం. ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి.' అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

'ప్రముఖ చలనచిత్ర నటులు, నటరత్న, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రివర్యులు డా.నందమూరి తారకరామారావు గారి జయంతిని పురస్కరించుకుని వారికి ఘననివాళులు అర్పిస్తున్నాను.' అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

'తన నటనతో దేశ సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ధీశాలి.. ఏ పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. తెలుగుతనానికి తేనియలద్దిన తేజోవిరాళి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలి.' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News