Chiranjeevi: ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

Mega star Chiranjeevi Tweet on NTR 101 Birth Anniversary

  • నేడు ఎన్‌టీఆర్‌ 101వ జయంతి
  • ఈ సంద‌ర్భంగా 'ఎక్స్' వేదిక‌గా చిరు స్పెషల్ పోస్ట్ 
  • ఎన్‌టీఆర్‌ కీర్తి అజరామరం అన్న చిరంజీవి
  • ఎన్‌టీఆర్‌ చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచితమ‌ని వ్యాఖ్య‌

నేడు ఎన్‌టీఆర్‌ 101వ జయంతి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు నివాళులు ఆర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్‌టీఆర్‌ను స్మరించుకుంటూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా చిరు.. ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం సముచితమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ.. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చిరు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక చిరంజీవి-ఎన్‌టీఆర్‌ కాంబోలో వచ్చిన ఏకైక సినిమా 'తిరుగులేని మనిషి'. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్ లో స్టార్లుగా ఉన్నా కూడా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకొనేవారు. ఇక ఆ స్నేహాన్ని ఆయ‌న త‌నయుడు నంద‌మూరి బాలకృష్ణ ఇప్పుడు కొనసాగిస్తున్నాడు.

  • Loading...

More Telugu News