Narendra Modi: ఎన్డీయేకి లభించే స్థానాల సంఖ్య అంతకంతకు మెరుగవుతోంది: నరేంద్ర మోదీ

Modi says NDA numbers are looking better and better

  • నేడు దేశంలో ఆరో దశ పోలింగ్
  • ఓటింగ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన ప్రధాని మోదీ
  • ఇండియా కూటమికి ఓటు వేస్తే వ్యర్థమని ప్రజలు గ్రహించారంటూ ట్వీట్

దేశంలో నేడు ఆరో దశ పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞలు తెలుపుకుంటున్నాను. పోలింగ్ సాగే కొద్దీ ఎన్డీయేకి లభించే స్థానాల సంఖ్య అంతకంతకు మెరుగవుతోంది. ఇండియా కూటమి అధికారానికి దరిదాపుల్లోకి కూడా రాదన్న విషయం ప్రజలకు అర్థమైంది. ఆ కూటమికి ఓటు వేస్తే వ్యర్థమని గ్రహించారు" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Narendra Modi
Sixth Phase
Lok Sabha Polls
NDA
INDIA Bloc
BJP
Congress
India
  • Loading...

More Telugu News