Chiranjeevi: 'గాడ్ ఫాదర్' డైరెక్టర్ తో మెగాస్టార్!

 Chiranjeevi in Mohan Raja Movie

  • 'విశ్వంభర' షూటింగులో బిజీగా చిరంజీవి 
  • మోహన్ రాజా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ 
  • గతంలో ఈ కాంబోలో వచ్చిన 'గాడ్ ఫాదర్'
  • లైన్ లోనే ఉన్న మారుతి - హరీశ్ శంకర్  


చిరంజీవి ఇప్పుడు 'విశ్వంభర' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీవశిష్ఠ దర్శకత్వంలో .. యూవీ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమౌతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా - చిరంజీవి కాంబినేషన్లో 'గాడ్ ఫాదర్' సినిమా వచ్చింది. 'లూసిఫర్' రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. 2022లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. 

అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ, చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మారుతి .. హరీశ్ శంకర్ దర్శకత్వంలోను చిరంజీవి సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది చూడాలి.

  • Loading...

More Telugu News