Nagababu Twitter: ఆ ట్వీట్ ను డిలీట్ చేశా.. నాగబాబు

Janasena Leader Nagababu Twitter ReEntry

  • మావాడు, పరాయి వాడు అంటూ చేసిన ట్వీట్ పై వివరణ
  • ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జనసేన లీడర్
  • విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నాగబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల ఒత్తిడికి నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ ఇచ్చి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

నాగబాబు ట్వీట్ ఇదే..
తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైనా పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమ వాడేనంటూ పోస్ట్ పెట్టారు. ఇది అల్లు అర్జున్ ను ఉద్దేశించిందేనని ప్రచారం జరిగింది. ఎందుకంటే.. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నంద్యాలకు వెళ్లి శిల్పా రవిచంద్రను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అయితే, స్వయానా మేనమామ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నా అల్లు అర్జున్ అటువైపు తొంగిచూడలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే నాగబాబు ఈ ట్వీట్ చేశాడని అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు.

Nagababu Twitter
Allu Arjun
janasena
AP Assembly Polls
Pawan Kalyan

More Telugu News