Car Accident: మాదాపూర్ లో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

Car Accident In Hyderabad One dead and Onther Injured

  • పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వెళుతున్న కారు 
  • మాదాపూర్ స్టేజీ వద్ద అదుపుతప్పిన వైనం 
  • పాల వ్యాపారికి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది. మాదాపూర్ స్టేజీ వద్ద రోడ్డు పక్కనే ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలంలో ఉన్న వారు చెబుతున్నారు. 

ఒక్కసారిగా కారు మీదికి దూసుకురావడంతో ఏం జరిగిందనేది అర్థం కాలేదని, తేరుకునే సరికే ఓ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. రోడ్డు పక్కనే పాలవ్యాపారం చేసుకునే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్ కు ఫోన్ చేసినట్లు అక్కడున్న వారు తెలిపారు. కాగా, నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News