West Bengal: బెంగాల్‌లో బీజేపీ 30 సీట్ల వరకు గెలుచుకుంటుంది: అమిత్ షా

Amit Shah says BJP will win 30 seats in bengal

  • 2029 వరకు మోదీయే ప్రధానిగా ఉంటారన్న అమిత్ షా
  • 2029 తర్వాత కూడా మోదీయే తమ నాయకుడిగా ఉంటారని స్పష్టీకరణ
  • బెంగాల్‌లో జరుగుతున్న దౌర్జన్యాలపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 24 నుంచి 30 స్థానాల వరకు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2029 వరకు మోదీయే ప్రధానిగా ఉంటారని స్పష్టం చేశారు. 2029 తర్వాత కూడా మోదీయే తమ నాయకుడిగా ఉంటారన్నారు. బెంగాల్‌లో జరుగుతున్న దౌర్జన్యాలపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని... వారి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. సందేశ్‌కాళీ ఘటన విషయంలో మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన మహిళలపై బెంగాల్‌లో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News