Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ శుభవార్త

Metro is good news for Hyderabad residents

  • మార్చి 31తో ముగిసిన రాయితీల పొడిగింపు
  • పలు ఆఫర్ల గడువును 6 నెలలపాటు పెంచుతూ ప్రకటన
  • ఉగాది వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన హైదరాబాద్ మెట్రో

ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నామన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు.

కాగా ఇప్పటివరకు అందించిన రాయితీలకు మంగళం పాడుతున్నట్టుగా రెండు రోజుల క్రితమే మెట్రో రైల్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం, రాత్రి వేళల్లో అందించే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.59కే ప్రయాణ సౌలభ్యం కల్పించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం తగ్గింపు అందించే సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిశాయి. దీంతో రాయితీలు పొడిగించకపోవడంపై మెట్రో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Hyderabad Metro
Metro Rail
Hyderabad
Hyderabad District
  • Loading...

More Telugu News