Minister Komatireddy: కేసీఆర్ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయి.. ఆయ‌న‌ చేసిన మొద‌టి త‌ప్పు అదే: మంత్రి కోమ‌టిరెడ్డి

Minister Komatireddy Venkat Reddy Criticizes BRS Chief KCR
  • కేసీఆర్ చేసిన మొద‌టి త‌ప్పు యాద‌గిరిగుట్ట పేరును మార్చ‌డ‌మేన‌న్న కాంగ్రెస్ నేత‌ 
  • దేవుడి పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని మండిపాటు
  • యాద‌గిరి గుట్ట‌లో స్కామ్ జ‌రిగిందంటూ మంత్రి ఆరోప‌ణ‌ 
  • యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తామ‌న్న మంత్రి కోమ‌టిరెడ్డి
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి శుక్ర‌వారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయ‌న్నారు. ఇంకా మంత్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. యాద‌గిరిగుట్ట పేరును మార్చ‌డ‌మే కేసీఆర్ చేసిన మొద‌టి త‌ప్పు అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్‌ చేసిన పాపాల వ‌ల్ల క‌రువు వ‌చ్చింద‌న్నారు. అలాగే యాద‌గిరి గుట్ట‌లో భారీ స్కామ్ జ‌రిగింద‌ని మంత్రి ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత విచార‌ణ చేస్తామ‌ని తెలిపారు. అంతేగాక‌ యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తామ‌ని చెప్పారు. గేట్లు తెర‌వ‌క‌ముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వ‌స్తున్నార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
Minister Komatireddy
BRS
KCR
Yadagiri Gutta
Telangana

More Telugu News