Chandrababu: మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషం కలిగిస్తోంది: చంద్రబాబు

Chandrababu said he feels happy for rejoining NDA
  • ఏపీలో చేయి కలిపిన టీడీపీ-జనసేన, బీజేపీ
  • బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు
  • కూటమితో స్వర్ణయుగం వస్తుందని స్పష్టీకరణ
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడిన అనంతరం చంద్రబాబు స్పందించారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. ఏపీకి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు అని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురుచూస్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

ఈ కూటమి ప్రజాశ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు.
Chandrababu
NDA
TDP
BJP
Janasena

More Telugu News