Chandrababu: ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు, పవన్ పర్యటన

Chandrababu and Pawan Kalyan Delhi tour concluded

  • చంద్రబాబు, పవన్ ల ఢిల్లీ పర్యటన సక్సెస్
  • బీజేపీతో కుదిరిన పొత్తు
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనం

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. బీజేపీతో పొత్తును ఖరారు చేసుకోవాలని ఢిల్లీ వెళ్లిన ఇరువురు నేతలు అనుకున్న కార్యాన్ని జయప్రదం చేశారు. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారైందని నేడు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. వారిద్దరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. తదుపరి కార్యాచరణపై త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి.

  • Loading...

More Telugu News