Raghu Rama Krishna Raju: షర్మిలను బూతులు తిట్టిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju fires on YSRCP

  • తనపై పోటీ చేసే అభ్యర్థి ఎవరో చెప్పాలని రఘురాజు డిమాండ్
  • లేకపోతే జగనే తనపై పోటీ చేయాలని సవాల్
  • షర్మిల వైఎస్ కూతురు కాదనే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపాటు

తనపై సోషల్ మీడియాలో వైసీపీ ఎంత చెత్త ప్రచారం చేసినా ఉపయోగం లేదని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ముందు తనపై పోటీ చేసే అభ్యర్థిని చూసుకోవాలని ఎద్దేవా చేశారు. తనపై పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఎవరో చెప్పాలని, లేకపోతే జగనే తనపై పోటీ చేయాలని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా కూటమి తరపున తాను పోటీ చేస్తానని చెప్పారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిలను వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు జరిగిన నష్టాన్ని, ఆమె పట్ల జగన్ వ్యవహరించిన తీరు గురించి చెపితే... ఆమె రాజశేఖరరెడ్డి కూతురే కాదనే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె గురించి నీచంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
YS Sharmila
Congress
Telugudesam
Janasena
AP Politics
  • Loading...

More Telugu News