Ayodhya Ram Mandir: అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకపై చిరంజీవి ఏమన్నారంటే...!

Chiranjeevi about their experience at Ayodhya Ram Mandir
  • బాలరాముని ప్రాణప్రతిష్ఠ గొప్ప అనుభూతిని ఇచ్చిందన్న చిరంజీవి
  • దేశంలోని ప్రజలందరికీ మరిచిపోలేని రోజు అన్న మెగాస్టార్
  • శ్రీరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యానన్న వివేక్ ఒబెరాయ్
అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది దేశంలోని ప్రజలందరికీ ఓ మరిచిపోలేని రోజు అన్నారు. అయోధ్య రామమందిరానికి రావడం తనకు ఓ గొప్ప అనుభూతి అన్నారు.

శ్రీరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాను: వివేక్ ఒబెరాయ్

శ్రీరాముడి విగ్రహాన్ని చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు. బాలరాముడి విగ్రహం చాలా అందంగా ఉందన్నారు. విగ్రహాన్ని చూస్తే రాముడిని చూస్తున్న అనుభూతి కలుగుతోందన్నారు. ప్రతి కుటుంబానికి ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నానన్నారు.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Ayodhya

More Telugu News