Pendem Dorababu: జగన్ ఆలోచించి నాకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా: ఎమ్మెల్యే పెండెం దొరబాబు

I hope Jagan will ticket to me says MLA Pendem Dorababu

  • పిఠాపురం ఇన్ఛార్జీగా వంగా గీతను నియమించిన జగన్
  • తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు
  • నియోజకవర్గంలో తనకే పట్టు ఉందన్న ఎమ్మెల్యే

పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎం జగన్ ఈసారి టికెట్ ను ఇవ్వడం లేదంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన బలప్రదర్శన చేశారు. తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అనుచరులకు ఆయన ఈరోజు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చారు. 

ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ... పిఠాపురం స్థానంపై జగన్ పునరాలోచించాలని చెప్పారు. ఈ నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టు ఉందని... తన జన్మదిన వేడుకలకు వేలాది మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. జగన్ ఆలోచించి తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. 

మరోవైపు, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్ఛార్జీగా నియమించారు. దీంతో, ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జనసేనలోకి ఆయన వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

  • Loading...

More Telugu News