Budda Venkanna: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే మిగిలుంది: బుద్ధా వెంకన్న

Budda Venkanna take a dig at CM Jagan

  • 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా ముగుస్తోందన్న బుద్ధా
  • 2024లో అందరూ సంతోషంగా ఉంటారని వెల్లడి
  • రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 2023... జగన్ విధ్వంస నామ సంవత్సరంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. 2024లో రాక్షస పాలన అంతరిస్తుందని, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ తోనే జగన్ పతనం ప్రారంభమైందని అంటున్నారని, వాస్తవానికి జగన్ పతనం ఎప్పుడో ప్రారంభమైందని, చంద్రబాబు అరెస్ట్ తో జగన్ పతనం పూర్తయిందని బుద్ధా వెంకన్న వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే ఇక మిగిలుందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు.

Budda Venkanna
Jagan
2023
2024
TDP
Janasena
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News