Congress: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జుల నియామకం

17 lok Sabha incharges announced in telangana

  • అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలు
  • సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు బాధ్యతలు
  • మల్లు భట్టి, పొన్నం, దామోదర సహా పలువురికి బాధ్యతలు

రానున్న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జులను ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇంఛార్జులను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు - రేవంత్ రెడ్డి; సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క; నాగర్ కర్నూలు - జూపల్లి కృష్ణారావు; నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి; భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి; వరంగల్ - కొండా సురేఖ; మహబూబాబాద్, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి; అదిలాబాద్ - సీతక్క; పెద్దపల్లి - దుద్దిళ్ల శ్రీధర్ బాబు; కరీంనగర్ - పొన్నం ప్రభాకర్; నిజామాబాద్ - జీవన్ రెడ్డి; జహీరాబాద్ - పి.సుదర్శన్ రెడ్డి; మెదక్ - దామోదర రాజనర్సింహ; మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వర రావు.

  • Loading...

More Telugu News