Telangana Assembly Election: ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు ఇబ్రహీంపట్నంలో కలకలం.. ఆర్డీవో గదిలో సీలు లేని పోస్టల్ బ్యాలెట్లు
![Tensions prevelled in Postal Ballot as ballot vote boxes seal opened](https://imgd.ap7am.com/thumbnail/cr-20231203tn656bdcafb036d.jpg)
- పాస్ల కోసం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు
- తెరిచి ఉన్న పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన గది
- వాటిలో కొన్నింటి సీలు తెరిచి ఉండడంతో ఆందోళన
- ఆర్డీవోపై దాడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
- అక్కడ పోలైన 3 వేలకు పైగా ఓట్లు భద్రంగా ఉన్నాయన్న డీసీపీ
ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్లు కనిపించడం కలకలం రేపింది. స్ట్రాంగ్రూములో ఉండాల్సినవి అక్కడ ఉండడం, వాటిలో కొన్నింటికి సీల్ తీసి ఉండడం వివాదానికి కారణమైంది. విషయం తెలిసిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అనంతరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పోస్టల్ బ్యాలెట్ కవర్లు ఉన్న డబ్బాలు సీలు తొలగించారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.