Atchannaidu: ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: అచ్చెన్నాయుడు

TDP leaders met Chief Election Commissioner

  • ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ను కలిసిన టీడీపీ బృందం
  • అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు
  • 8 జిల్లాల కలెక్టర్లపై ఆధారాలతో ఫిర్యాదు చేశామని వెల్లడి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం నేడు రాష్ట్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ ను కలిసింది. ఓట్ల నమోదు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు, తదితర టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో తాము చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎన్నికల ప్రధాన కమిషనర్ ను అడిగారు. 

అనంతరం, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎనిమిది జిల్లాల కలెక్టర్ల తీరు చూస్తుంటే, వారు జిల్లా కలెక్టర్లా లేక వైసీపీ కార్యకర్తలా అనే సందేహం వస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. వారిపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మీరు చేస్తున్న తప్పిదాలు రికార్డు అవుతున్నాయి... ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. 

అంతేకాకుండా, 17 నియోజకవర్గాలకు సంబంధించి ఆధారాలతో సహా వైసీపీ ఓట్ల అక్రమాలను ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం వైసీపీలో కనపడుతోందని విమర్శించారు.

Atchannaidu
TDP
Cheif Election Commissioner
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News