Devineni Uma: తమ్ముడి కోసం కోల్ కతా కేంద్రంగా రహస్యంగా ఇసుక టెండర్లు: దేవినేని ఉమ

Devineni Uma fires on Jagan

  • రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రాల అస్మదీయులకు అప్పగించారన్న దేవినేని
  • టెండర్లు ఖరారు కాకముందే దోపిడీ మొదలయిందని విమర్శ
  • 53 నెలల్లో రాష్ట్రాన్ని గంపగుత్తగా దోచేశారని మండిపాటు

రాష్ట్రంలోని ఇసుకను దోచేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తమ్ముడి కోసం కోల్ కతా కేంద్రంగా రహస్యంగా ఇసుక టెండర్లు వేయించారని ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం ఇసుకను పక్క రాష్ట్రాల అస్మదీయులకు అప్పగించారని విమర్శించారు. అనుభవం లేని కంపెనీలకు బిడ్లను ఖరారు చేశారని దుయ్యబట్టారు. టెండర్లు ఖరారు కాకముందే నెల రోజుల క్రితమే దోపిడీ మొదలయిందని అన్నారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ లలో సెంట్రలైజ్డ్ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం నేరమంటూ చంద్రబాబుపై కేసు పెట్టిన జగన్ రెడ్డి... 53 నెలల్లో రాష్ట్రాన్ని గంపగుత్తగా దోచేశారని మండిపడ్డారు.

Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News