Jagan: జగన్ పై సీఐడీకి ఫిర్యాదు చేసిన మేదర సామాజిక సంఘం

Medara Sangham complain on Jagan to CID

  • తమను ఎస్సీల్లో చేరుస్తామని చెప్పి, జగన్ మాట తప్పారన్న మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
  • సీఎం అయిన తర్వాత తమను పట్టించుకోలేదని మండిపాటు
  • ఇప్పుడు మరోసారి తమను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ

మేదర సామాజికవర్గాన్ని ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి సీఎం జగన్ మోసం చేశారంటూ ఆ సామాజిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. తమను ఎస్సీల్లో చేరుస్తామని ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు జగన్ హామీ ఇచ్చారని... ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. 2019లో ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత అనేకసార్లు కలిసి వినతి పత్రాలను ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో తమను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ వైఖరిని నిరసిస్తూ ఆయనపైనా, ఆయన పార్టీకి చెందిన 26 మంది ఎంపీలు, 150 మంది ఎమ్మెల్యేలపై సీఐడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News